కెసిఆర్, సోనియా గాంధీలను టార్గెట్ చేసిన ఎమ్మెల్యే కొండా సురేఖ

Konda Surekha
వరంగల్: ముఖ్యమంత్రిని మార్చి కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో చీలిక తీసుకు వచ్చిందని జగన్ వర్గం కాంగ్రెస్ శాసనసభ్యురాలు కొండా సురేఖ మంగళవారం ధ్వజమెత్తారు. రోశయ్యను మార్చి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. పార్టీలో కిరణ్ కన్నా సీనియర్లు లేరా అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానం అభద్రతా భావంలో ఉందన్నారు. జగన్ ఏనాడు ముఖ్యమంత్రి పదవిని కోరలేదని ఆమె చెప్పారు. జగన్ రాసిన లేఖకు సోనియాగాంధీ వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

మంత్రి పదవులు తీసుకునేవారు డిసెంబర్ 31 తరువాత రాజీనామాకు సిద్ధపడతారా అని ఆమె ప్రశ్నించారు. స్పీకరు, ఉపముఖ్యమంత్రి పదవులు ఎరచూపి పార్టీ అధిష్టానం తెలంగాణను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. కెసిఆర్ తో పార్టీ నాయకుల మంతనాల రహస్యాలు ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు. డిసెంబర్ 31న తెలంగాణ రాకుంటే తాను ప్రత్యక్ష పోరాటానికి దిగుతానని ఆమె ప్రకటించారు. జగన్ ది దుందుడుకు చర్య కాదని ఆమె స్పష్టం చేశారు. ఆయన అన్నీ ఆలోచించే చేస్తున్నారన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మృతిపై రాష్ట్ర ప్రజలకు అనుమానాలు ఉన్నాయని ఆమె చెప్పారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదం మృతిపై ప్రజల అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం కేంద్రానికి ఉందన్నారు. జగన్ చిన్నాన్న వైయస్ వివేకానంద జగన్ పై విమర్శలు చేయటం ఆయన ఒంట్లో పుట్టింది కాదన్నారు. ఆయనతో అధిష్టానం ఆట ఆడిస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+