ముఖ్యమంత్రిపై అసంతృప్తితో కాటసాని రాంభూపాల్ రెడ్డి తిరుగుబాటు?

Katasani Rambhupal Reddy
హైదరాబాద్‌: మంత్రి పదవి దక్కని కర్నూలు జిల్లాకు చెందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి తిరుగుబాటుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. మంత్రి పదవి ఆశించి ఆయన భంగపడ్డారు. తమకు మంత్రి పదవి ఇందుకు ఇవ్వలేదో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. కడప జిల్లాకు మూడు మంత్రి పదవులు ఇచ్చిన ముఖ్యమంత్రి కర్నూలు జిల్లాకు మరోటి ఇస్తే ఏం పోయిందని ఆయన అడిగారు. గతంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కూడా తనకు అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తన నియోజకవర్గం కార్యకర్తలతో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకుంటానని ఆయన చెప్పారు. తాను మంత్రి పదవికి పనికి రానని అనుకున్నారా అని ఆయన అడిగారు. కర్నూలు నుంచి టిజి వెంకటేష్ కు, ఎరాసు ప్రతాప రెడ్డికి మంత్రివర్గంలో స్థానం లభించింది. సీనియర్ అయిన కాటసాని రాంభూపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి తప్పకుండా వస్తుందని ఆశిస్తూ వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+