వట్టితో మాట్లాడాలని కెవిపి రామచంద్రారావుకి అధిష్టానం ఫోన్

సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశానికి అందరూ హాజరు కావాలని ఆదేశించింది. అందరూ ముఖ్యమంత్రికి అక్కడ మద్దతుగా నిలబడాలని ఆదేశించింది. కాంగ్రెసు అధిష్టానం కఠినంగా వ్యవహరించడంతోనే వట్టి వసంత్ కుమార్ కాస్త వెనక్కి తగ్గినట్టు సమాచారం. వట్టి మొండి పట్టుదలగా ఉంటే మంత్రి పదవితో పాటు శాసనసభ్యత్వ రాజీనామాను ఆమోదిస్తామని ప్రకటించినట్టు సమాచారం. వట్టి మొదట మంత్రి పదవితోపాటు, శాసనసభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు.
అధిష్టానం సీరియస్ కావటంతో ఆయన శాసనసభ్యునిగా కొనసాగుతానని, కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని మీడియాకు లేఖ విడుదల చేశారు. కాగా బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్యలకు సైతం సోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి అహ్మద్ పటేల్ ఫోన్ చేశారు. దీంతో అసంతృప్త మంత్రులు క్యాబినెట్ సమావేశానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.












Click it and Unblock the Notifications