అసమ్మతి మంత్రులపై హై కమాండ్ సీరియస్, వెనక్కి తగ్గాలని సూచన

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన దూతలుగా అసమ్మతి మంత్రులతో చర్చలు జరపడానికి మంత్రులు కె. జానారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, పితాని సత్యనారాయణ వంటివారిని రంగంలోకి దింపారు. వారు అసమ్మతి మంత్రులతో విడివిడిగా చర్చలు జరుపుతున్నారు. అధిష్టానం హెచ్చరికతో అసమ్మతి మంత్రులు ఓ మెట్టు దిగినట్లు తెలుస్తోంది. తొలుత సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశానికి హాజరు కాకూడాదని భావించిన అసమ్మతి మంత్రులు ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నారు. మంత్రులెవరూ రాజీనామా చేయరని, ముఖ్యమంత్రి పరిస్థితిని చక్కదిద్దుకుంటారని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఢిల్లీలో చెప్పారు. మంత్రి పదవి రాలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పాణ్యం శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రిని కలిశారు.
కాగా, మంత్రివర్గంలో చోటు చేసుకున్న అసంతృప్తిపై ఢిల్లీలోని కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఆసక్తిగా గమనిస్తున్నారు. వారు అధిష్టానానికి చెందిన పెద్దలను కలిశారు. ప్రాంతాలవారీగా పార్లమెంటు సభ్యులు సమావేశమయ్యారు. మంత్రివర్గంపై నోరు మెదపవద్దని అధిష్టానం వారిని ఆదేశించింది.












Click it and Unblock the Notifications