ధర్మాన నివాసంలో అసంతృప్త మంత్రుల భేటీ, కార్యాచరణపై చర్చ

వట్టి వసంత్ కుమార్ ఇప్పటికే మంత్రిపదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనను తన రాజీనామా ఉపసంహరించుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. వట్టితో మాట్లాడడానికి ఆనం రామనారాయణరెడ్డిని దూతగా పంపించారు. అయితే ఆయన ఆనంతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. తను ఆయనతో మాట్లాడేది లేదని చెప్పారు. వట్టి కనుక తన రాజీనామాను ఉపసంహరించుకోకపోతే ఆయన రాజీనామా ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. కాగా చివరి నిమిషం వరకు ఉపముఖ్యమంత్రి అభ్యర్థిగా పేరు వినిపించిన దామోదర రాజనర్సింహ ఇంటిలో శాసనసభ్యులు కె లక్ష్మారెడ్డి, జగ్గారెడ్డి, ముఖేష్ గౌడ్ లు సైతం భేటీ అయ్యారు.
తనకు 15 రోజులు సమయం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆసంతృప్త మంత్రులను కోరారు. అసంతృప్త మంత్రులు ప్రాంతాల వారిగా విడిపోయి భేటీ అవుతున్నారు. వారు తమ అధిష్టానం రావాల్సిందిగా కోరుతున్నారు. అధిష్టానానికి తమ డిమాండ్లు ముందు పెడుతున్నారు. అధిష్టానం నుండి ఎవరైన వస్తే తమ డిమాండ్లు ఎలా ఉండాలో వారు భేటీలలో చర్చించుకున్నట్లు సమాచారం. అయితే రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్పమొయిలీగానీ, ఆజాద్ గానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications