శాఖలు మార్చేది లేదంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

ఆనం రామనారాయణ రెడ్డి, పితాని సత్యనారాయణ, రఘువీరా రెడ్డి, కె. జానారెడ్డి ముఖ్యమంత్రి తరఫున రాయబారులుగా అసమ్మతి మంత్రులతో చర్చలు జరిపారు. పార్టీ అధిష్టానం కూడా రంగంలోకి దిగింది. దీంతో చాలా మంది దారికి వచ్చినట్లు తెలుస్తోంది. వట్టి వసంతకుమార్, బొత్స సత్యనారాయణ వంటి ఇద్దరు, ముగ్గురు మంత్రులు తప్ప మిగతా వారంతా ఆసంతృప్తితోనే సర్గుకుపోవడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.
మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, విస్తరమ సమయంలో శాఖలను మార్చడానికి వీలవుతుందని, ఇప్పుడు శాఖలు మారిస్తే ఇతరులు అసంతృప్తికి గురయ్యే ప్రమాదం ఉందని కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. డిసెంబర్ 31వ తేదీన శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత మంత్రుల శాఖల మార్పులు చేసుకోవచ్చునని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చేవరకు ఉప ముఖ్యమంత్రి పదవి ఊసెత్తకూడదని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications