వైయస్ వివేకా దౌత్యం: అధిష్టానానికి అసమ్మతి మంత్రుల అల్టిమేటం

ధర్మాన ప్రసాదరావు నివాసంలో జరిగిన అసమ్మతి మంత్రులు, శాసనసభ్యుల సమావేశం ముగిసింది. కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. అధిష్టానం హామీ ఇస్తేనే తాము సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశానికి హాజరవుతామని వారు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో చెప్పినట్లు తెలుస్తోంది. వారు ప్రణబ్ ముఖర్జీతో ఫోన్ లో మాట్లాడారు. సీనియర్లకు కీలక శాఖలు కేటాయించాలని, మంత్రులందరి శాఖలను కూడా మార్చాలని వారు పట్టుబడుతున్నారు. ముఖ్యమంత్రి నుంచి ప్రతిపాదనలు వస్తే చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా వారు చెబుతున్నారు.
కాగా, అంతా సర్దుకుంటుందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్పమ మొయిలీ ఢిల్లీలో అన్నారు. తాము హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంతా చూసుకుంటారని ఆయన అన్నారు. మంత్రి వర్గ సంక్షోభంపై భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామనే హామీపై మాత్రం మాట్లాడడానికి ఆయన నిరాకరించారు.












Click it and Unblock the Notifications