కొత్త పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి: వైయస్ జగన్ పై డిఎస్

D Srinivas
న్యూఢిల్లీ: కొత్త పార్టీలు వస్తుంటాయి పోతుంటాయని, కాంగ్రెసు పార్టీ మాత్రం ఉంటుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వైయస్ జగన్ పెట్టదలుచుకున్న కొత్త పార్టీపై వ్యాఖ్యానించారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలోని సమస్యలు త్వరలోనే సమసిపోతాయని ఆయన అన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం చేస్తూ పదవుల పంపకాల్లో సమతౌల్యం పాటించే ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సోనియాతో తాను పార్టీ సంస్థాగత వ్యవహారాలపై మాత్రమే మాట్లాడినట్లు ఆయన తెలిపారు.

రాష్ట్రంలో నిర్వహించిన కాంగ్రెసు 124 ఏళ్ల సంబరాలపై సోనియా ఆనందించినట్లు ఆయన తెలిపారు. రాష్టంలో పార్టీ, ప్రభుత్వం చక్కబడుతాయని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితులను చక్కదిద్దుతారని ఆయన అన్నారు. పిసిసి అధ్యక్షుడిగా తనను కోనసాగించాలా, వద్దా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. ఏ బాధ్యత అప్పగించినా తన పూర్తి శక్తినీ వినియోగిస్తానని, మనసు పెట్టి పని చేస్తానని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+