హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్ కుమార్ రెడ్డికి సోనియా గాంధీ అక్షింతలు: జగన్ సాక్షి వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అక్షింతలు వేసినట్లు వైయస్ జగన్ కు చెందిన సాక్షి టీవీ చానెల్ ఓ వార్తాకథనాన్ని మంగళవారం ప్రసారం చేసింది. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో సమావేశమయ్యారు. సోనియా గాంధీని కూడా కలిశారు. కిరణ్ కుమార్ రెడ్డి తీరు పట్ల ఆమె తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మీరు పరణతితో వ్యవహరించడం లేదని ఆమె కిరణ్ ను తప్పు పట్టినట్లు తెలుస్తోంది. ఏ ఒక్కరు కూడా మీ గురించి మంచిగా మాట్లాడడం లేదని ఆమె అన్నారట.

ఉన్న సమస్యలకు తోడు కొత్త సమస్యలు సృష్టిస్తున్నారంటూ ఆమె మండిపడ్డారని తెలుస్తోంది. మీరు సమస్యలు సృష్టిస్తుంటే మేం పరిష్కరించుకుంటూ వెళ్లాలా అని ఆమె అడిగినట్లు తెలుస్తోంది. పార్టీ పార్లమెంటు సభ్యులను మీరు ఎందుకు సంప్రదించడదం లేదని, అందులో మీకున్న ఇబ్బందులేమిటని ఆమె కిరణ్ ను అడిగారని సమాచారం. దీంతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను తనకు అనుకూలంగా ఉండే వారికి ఇప్పించుకోవాలనుకున్న కిరణ్ వ్యూహం దెబ్బ తిన్నదని, ఆ పదవుల గురించి సోనియాతోనే మాట్లాడలేదని తెలుస్తోంది.

ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఆరు నెలల పాటే ఉంటారని ఢిల్లీలో ప్రచారం జరుగుతోందని సాక్షి టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. ఏది అడిగినా సోనియా గాంధీ ఆరు నెలల తర్వాతనే అని అన్నారని చెప్పింది. దీంతో శాసనసభా శీతాకాలం సమావేశాలు స్పీకర్ లేకుండానే జరుగుతాయని అంటున్నారు. డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో శాసనసభ నడిపించాలని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి స్పీకర్ పదవితో పాటు ఇతర పదవుల ఎంపిక కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X