వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్మోహన్ పార్టీ తెలంగాణ కన్వీనర్ గా కొండా సురేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha
వరంగల్: మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పెట్టే పార్టీకి తెలంగాణ ప్రాంతం కన్వీనర్ గా మాజీ మంత్రి కొండా సురేఖ ఉండే అవకాశాలు ఉన్నాయా! అంటే అవుననే చెప్పవచ్చు. వైయస్ కుటుంబానికి వీరాభిమాని అయిన కొండా సురేఖకు జగన్ మంచి పదవి ఇచ్చే అవకాశాలే ఉన్నాయి. కొండా సురేఖ సైతం ఓ ఛానల్ కు మంగళవారం ఇచ్చిన ముఖాముఖిలో జగన్ పార్టీకి తెలంగాణ కన్వీనర్ గా ఉంటానని చెప్పారు. జగన్ కొత్త పార్టీ పెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు.

జగన్ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మేం తెలంగాణకు అనుకూలమేనని ఆమె చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణపై భవిష్యత్తు రూపొందిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ సమైక్యాంధ్ర అన్నప్పటికీ ఆ పార్టీ తెలంగాణ నేతలు తెలంగాణ కోసం పోరాడుతున్న విధంగానే మా పోరాటం ఉంటుందన్నారు. జగన్ తో సమావేశమయి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. జగన్ పెట్టే పార్టీలో తనకు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానన్నారు. నిరంతరం వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటానన్నారు.

వైయస్ రాజశేఖరరెడ్డి నిర్ణయాలు మా ఊహకు అందేవి కాని జగన్ నిర్ణయాలు మాత్రం మా ఊహకు అందడం లేదన్నారు. జగన్ కు వైయస్ కన్నా ఎక్కువ రాజకీయ అవగాహన ఉందన్నారు. జగన్ కు ప్రజల అండ ఉందని చెప్పారు. కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన వారు పార్టీ పెడితే విఫలమవుతున్నారనే వాదనల్లో నిజం లేదన్నారు. అయితే 90 శాతం మంది విఫలమైనా, మమతా బెనర్జీ, శరద్ పవార్ వంటి వారి పది శాతం మందిలో జగన్ కూడా ఉండవచ్చని ఆమె చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X