జగన్ ను పవర్ ఫుల్ పంచ్ లతో చీల్చి చెండాడిన విహెచ్

అటువంటి వ్యక్తి పార్టీ పెడ్తాడట, 30 ఏళ్లు పరిపాలిస్తాడట, జగన్ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని, అన్నం పెట్టిన కాంగ్రెసును, సోనియాను తిడ్తాడు, రాహుల్ ను, పార్టీ సీనియర్ నేతలూ తిడ్డాడని, శవమే రాలేదు, సంతకాలు సేకరించాడు, అతను త్యాగం చేశానని అంటున్నాడని ఆయన అన్నారు. 150 మంది శాసనసభ్యులు సంతకాలు చేసినా తాను ముఖ్యమంత్రి పదవి వదులుకున్నానని చెప్పుకుంటున్నాడని, పెద్ద త్యాగం చేశానని చెప్పుకుంటున్నాడని, శవం దగ్గర సంతకాలు పెట్టాలని అడిగినప్పుడు పెట్టకుంటే ఏమనుకుంటారోనని పెట్టారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్నో అవకాశాలు ఇచ్చారని, జగన్ మామకు కడప మేయర్ గా అవకాశం ఇచ్చారని ఆయన అన్నారు.
తన కుటుంబాన్ని చీల్చారని వైయస్ జగన్ అనడాన్ని ఆయన తప్పు పట్టారు. చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి వైయస్ జగన్ కోసం పార్లమెంటు సీటును త్యాగం చేశారని, చిన్నాన్నది త్యాగం కాదా, కుటుంబంలో అన్నీ తనకే కావాలని జగన్ ఉద్దేశ్యమని, నాయన మరణం తర్వాత అన్నీ నాకే కావాలని జగన్ అంటున్నాడని, వైయస్ వివేకానంద మంత్రి పదవి తీసుకుంటే తప్పవుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి గురించి ఆలోచిస్తున్న వైయస్ జగన్ ప్రజలకు సేవ చేస్తానంటే ఎవరూ నమ్మే స్థితి లేదని ఆయన అన్నారు. ప్రజలు తెలివిలేని వారు కాదని ఆయన అన్నారు.
జగన్ పార్టీ పెట్టుకోవచ్చు, కానీ కాంగ్రెసు కుంభకోణాలమయమని తిట్టడం సరి కాదని ఆయన అన్నారు. కాంగ్రెసులో కుంభకోణాల గురించి వైయస్ జగన్ మాట్లాడుతున్నాడు కాబట్టి అవి తేలాల్సిందేనని, కుంభకోణాలకు ఎవరు పాల్పడ్డారో తేలాలని ఆయన అన్నారు. వైయస్ జగన్ ఏదో ఆరోపిస్తే మీరు నన్ను అడుతారు, జగన్ ఆ ఆరోపణలు చేసినప్పుడు నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందని మీరు ఎందుకు ఆయనను అడగరు, జగన్ ను అడిగిన తర్వాతనే నా వద్దకు రండి అని విహెచ్ మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications