వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై శివరాజ్ పాటిల్ విచారణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Shivraj Patil
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై విచారణకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన శివరాజ్ పాటిల్ ను విచారణ కమిటీ చైర్మన్ గా నియమించినట్లు టెలీకమ్ మంత్రి కపిల్ సిబాల్ చెప్పారు. నాలుగు వారాల్లోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం శివరాజ్ పాటిల్ ను ఆదేశించింది. 2001 నుంచి 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై కమిటీ విచారణ జరుపుతుంది.

2జి స్పెక్ట్రమ్ కుంభకోణం దేశంలో సంచలనం సృష్టించింది. ప్రతిపక్షాలు పార్లమెంటు సమావేశాలను వరుసగా స్తంభింపజేస్తోంది. ఈ కుంభకోణానికి సంబంధించి ఎ. రాజా మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజా రాజీనామాతో కూడా ప్రతిపక్షాలు శాంతించలేదు. కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)ని నియమించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. చివరకు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X