మాకినేని పెద రత్తయ్యకు గాలం వేసిన వైయస్ జగన్ క్యాంప్
అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు జగన్ వర్గం నేతలు రంగంలోకి దిగారు. హైదరాబాద్ నుంచి జగన్ వర్గానికి చెందిన ఇద్దరు కీలక నేతలు బుధవారం రత్తయ్యకు ఫోన్ చేసి జగన్ పెట్టబోయే పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం. ఫోన్లో మంతనాలు జరిపినవారిలో జగన్ దగ్గర బంధువు కూడా ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత జిల్లాలో తనకు అత్యంత సన్నిహితులని భావించిన నేతల్లో అందుబాటులో ఉన్నవారిని పిలిపించుకొని రత్తయ్య సమాలోచనలు జరిపినట్టు సమాచారం.
Comments
Story first published: Thursday, December 9, 2010, 8:17 [IST]