దోచుకోవడమే విశ్వసనీయత అయితే అది నా వల్ల కాదు: బాబు

కాంగ్రెసుకు, తమ పార్టీకి ఓట్లలో తేడా ఒక్క శాతం మాత్రమేనని, ప్రజలు తమ వైపే ఉన్నారని ఆయన అన్నారు. రైతు సమస్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అవగాహన లేదని, అమలాపురం వెళ్లి వేరుశనగ పంట ఎక్కడ అని అడిగిన ఘనుడని ఆయన అన్నారు. సభ వాయిదా పడితే రైతు సమస్యలపై చర్చ జరగకుండా చూసుకోవచ్చుననేది ప్రభుత్వ ఆలోచన అని ఆయన అన్నారు. రైతులు శాసనసభ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. రైపు జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని ఆయన చెప్పారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు రోడ్డుకు అడ్డం పెట్టి రహదారులను అడ్డుకోవాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications