తెలుగు వారిని చీల్చవద్దు: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్

Lagadapati Rajagopal
విజయవాడ: రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడటం తగదని వారి సమస్యలు పరిష్కరించే విషయంలో దృష్టి పెట్టాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ బుధవారం అన్నారు. కృష్ణా జిల్లాలో కాంగ్రెసు పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. జిల్లాలో కాంగ్రెసు పార్టీ పటిష్టంగానే ఉందన్నారు. ఈ నెల 21, 22వ తేదిన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు 48 గంటల పాటు మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు చేపట్టే నిరాహార దీక్షలో పాల్గొననని లగడపాటి ప్రకటించారు.

కాగా తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒకటిగా కలిసి ఉండాలన్నారు. తెలుగు వారందరూ కలిసి ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. తెలుగు జాతిని చీల్చాలని ఎవరూ ప్రయత్నాలు చేయవద్దని ఆయన కోరారు. రాష్ట్రం విడగొట్టాలనడం సమంజసం కాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+