రైతు సమస్యలపై పట్టువీడని చంద్రబాబు: అసెంబ్లీ వాయిదా

అసెంబ్లీని విపక్షాలు స్తంభింపజేస్తున్నాయని అధికార పార్టీ అనడం సరికాదన్నారు. 2జి స్పెక్ట్రం కుంభకోణంపై పార్లమెంటు నెల రోజుల పాటు స్తంభించడానికి కారణం అధికార పార్టీయేనన్నారు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందని, అక్కడ కాంగ్రెస్ పార్టీ విపక్షాలతో కలిసి 5 రోజులుపాటు సభను స్తంభింపజేశాయన్నారు. ఒరిస్సాలో విపక్షాలు పోడియంపై పడుకొని నిరసనలు తెలిపాయన్నారు. విపక్షాలు ప్రజా సమస్యలు పరిష్కరించాలనే పోరాడుతాయి.
సమస్యలు పరిష్కరించాలని మేం సభ ప్రారంభమైన రోజునుండి కోరుతున్నా ప్రభుత్వం స్పందించటం లేదన్నారు. సమస్యలు చెప్పకోవటానికి వచ్చిన రైతు నాయకులను అరెస్టు చేసింది. వారి అరెస్టును ప్రశ్నించిన మా శాసనసభ్యులను, నన్ను సైతం అరెస్టు చేశారన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడమేమిటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications