ప్రభుత్వంపై తెదేపా ఫైర్, రైతుల సమస్యలు పరిష్కరిస్తే దీక్ష విరమణ

Telugudesam
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు స్వయంగా తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు స్వయంగా ప్రకటించినప్పటికీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి అరెస్టు చేసిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోమవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై తాను ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం రైతు సమస్యలపై స్పందించేవరకు నిరాహార దీక్ష కొనసాగుతుందన్నారు. పక్క రాష్ట్రాల వారు మన రాష్ట్రం కంటే రైతులకు ఎక్కువిస్తున్నాయన్నారు. ఇక్కడ రైతుల గుండె ఆగిపోతుంటే మీకు ప్లీనరీలు కావాల్సి వచ్చాయా అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏనాడూ రాష్ట్ర ప్రయోజనాలపై, రైతుల సమస్యలపై రాజీపడలేదన్నారు.

రైతుల ఆత్మహత్యలకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు అన్నారు. ప్రకటించిన సాయంపై రైతుకు నమ్మకముంటే ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయన్నారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే సాయం మరింత ప్రకటించాలన్నారు. రైతులకు మాయమాటలు చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రైతులకు సరియైన న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ రైతు వ్యతిరేక ప్రభుత్వమని దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరిలు చెప్పారు. ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదన్నారు. వ్యవసాయంపై నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. డిమాండ్లు పరిష్కరిస్తేనే చంద్రబాబు నాయుడు దీక్ష విరమణపై ఆలోచిస్తామని వారు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+