రాష్ట్రంలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు: నలుగురు మృతి

ఇదే జిల్లాలోని తొండంగి మండలం కృష్ణాపురంలో మరో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలో 2 లక్షల మంది కౌలు రైతులు ఉన్నప్పటికీ వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రకటించిన సాయం ఏమాత్రం సరిపోవటం లేదు. గుంటూరు జిల్లా దాచెపల్లి మండలం తక్కెళ్లపాడులో నరసింహ అనే కౌలురైతు మరణించాడు. కడప జిల్లా సుండుపల్లి మండలంలో మునిశెట్టి అనే మరోరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించి ముందస్తు సాయం ఎప్పుడు అందుతుందో తెలియక, తెచ్చిన అప్పులు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications