సోనియా గాంధీని తాకిన వైయస్ జగన్ లక్ష్యదీక్ష సెగ

వైయస్ జగన్ దీక్షకు పెద్ద యెత్తున ప్రజలు, నాయకులు, శాసనసభ్యులు తరలిరావడం సోనియాను కలవరపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 25 మంది శాసనసభ్యులు జగన్ కు మంగళవారం మద్దతు ప్రకటించారు. తాజాగా, చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే షాజహాన్ కూడా జగన్ ను విజయవాడ దీక్షా ప్రాంగణంలో కలిశారు. మరో శాసనసభ్యుడు ఆళ్ల నాని కార్యకర్తలతో వైయస్ జగన్ దీక్షా ప్రాంగణానికి వస్తున్నారు. జగన్ కు మద్దతు తెలుపుతున్న శాసనసభ్యులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అస్థిరం పాలయ్యే ప్రమాదం ఉందని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో వైయస్ జగన్ దీక్షకు వచ్చిన శాసనసభ్యులకు అధిష్టానం నుంచి ఫోన్లు వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ దీక్షకు హాజరైన శాసనసభ్యులను కట్టడి చేసేందుకు అధిష్టానం రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications