మంత్రి శంకర్ రావుపై వైయస్ జగన్ వర్గం నేతల ఫైర్

మంత్రి శంకర్ రావు వ్యాఖ్యలు సరికావని శాసనసభ్యుడు శేషారెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు బలం ఉందో, జగన్ కు బలం ఉందో ప్రజల్లో తేల్చుకుందా రండి అన్నారు. జగన్ మద్దతుదారుల రాజీనామా కోరుతున్న వారు మొదట వారు రాజీనామా చేసి వైయస్ బొమ్మ లేకుండా గెలవాలని కొండా సురేఖ అన్నారు. అలా అయితే తాము రాజీనామాకు సిద్ధం అని కొండా సురేఖ తేల్చి చెప్పారు. అధిష్టానం రాజీనామా చేయాలని కోరితే రాజీనామా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నానని మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు అన్నారు.
శంకర్ రావు కూడా రాజీనామా చేసి మళ్లీ పోటీకి సిద్ధపడాలని అప్పుడే ఎవరికి ఎక్కువ మద్దతు ఉందో తెలుస్తుందన్నారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి కూడా శంకర్ రావుపై ధ్వజమెత్తారు. జగన్ మద్దతుదారులను రాజీనామా చేయమని అడిగే హక్కు మంత్రి శంకర్ రావుకు లేదని సబ్బం హరి అన్నారు. శంకర్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్లే ఆయనకు మంత్రి పదవి లభించిందని సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా అన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications