పుట్టబోయే పార్టీ కోసమే వైయస్ జగన్ లక్ష్యదీక్ష: మంత్రి డిఎల్

DL Ravindra Reddy
హైదరాబాద్: బెంగుళూరులో వ్యాపారాలు చేసుకునే మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రైతుల సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదని ఆరోగ్యశాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి బుధవారం విలేకరుల ప్రతినిధుల సమావేశంలో అన్నారు. త్వరలో పుట్టబోయే పార్టీ కోసం జగన్ లక్ష్యదీక్ష చేపట్టారన్నారు. దీక్ష పేరుతో రాజకీయ లబ్ధి పొందటమే ఆయన ఉద్దేశ్యమన్నారు. అంతేకాని రైతుల సమస్యలపై ఆయనకు ఏమాత్రం అవగాహన లేదన్నారు.

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి ఆరోగ్యం క్షీణిస్తోందని అన్నారు. చంద్రబాబు ఫ్లూయిడ్స్ తీసుకోకుంటే పరిస్థితి దిగజారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన పట్టుదలతో నిరాహార దీక్ష చేస్తే గుండె, రక్తనాళాలకు సమస్య వచ్చే పరిస్థితి ఉందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మరోసారి చర్చించి చంద్రబాబుతో మరోసారి చర్చలు జరుపుతామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు వైద్యం చేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+