స్పందించకుంటే ప్రభుత్వంపై తిరగబడండి: రైతన్నలకు హరికృష్ణ పిలుపు

కేంద్రం ప్రకటించిన 400 కోట్ల రూపాయల సాయం ఏమాత్రం సరిపోదన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఇదా అని ఆయన అన్నారు. సమస్యలపై రైతులు నిబ్బరం కోల్పోకూడదన్నారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా తిరగబడాలని చెప్పారు. రైతుల సమస్యలకోసం పోరాడుతున్న చంద్రబాబును రక్షించుకోవాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోవటం వల్ల పార్టీలో అంతర్గతంగా చర్చించుకొని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెదేపా సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి వేరుగా విలేకరులతో చెప్పారు. చంద్రబాబు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వైద్యుల నివేదిక తెలుపుతుందన్నారు. అవాస్తవాలు చెప్పటం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications