కేరళ మాజీ ముఖ్యమంత్రి కె. కరుణాకరన్ కన్నుమూత

కరుణాకరన్ 1918 జులై 5వ తేదీన జన్మించారు. చదువుకు మధ్యలోనే స్వస్థి చెప్పి ఆయన భారత జాతీయ కాంగ్రెసులో చేరారు. బారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. పలు మార్లు జైలుకు కూడా వెళ్లారు. కేరళలో కరుణాకరన్ 1970లో యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్)ను ఏర్పాటు చేశారు. రాజ్యసభకు మూడు సార్లు, లోకసభకు రెండుసార్లు ఆయన ఎన్నికయ్యారు. ఆయన విభేదాల కారణంగా కాంగ్రెసుకు రాజీనామా చేసి 2005 మే 1వ తేదీ నేషనల్ కాంగ్రెసు (ఇందిర)ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దాన్ని ఎన్సీపిలో విలీనం చేశారు. ఆ తర్వాత కూతురు పద్మజతో కలిసి తిరిగి కాంగ్రెసు పార్టీలోకి వచ్చారు.












Click it and Unblock the Notifications