సుబ్బారెడ్డి నివాసంలో వైయస్ వివేకానంద రెడ్డితో వైయస్ జగన్ భేటీ

క్రిస్మస్ వేడుకలను సాకుగా తీసుకుని వైయస్ వివేకానంద రెడ్డికి, వైయస్ జగన్ కు మధ్య వైయస్సార్ కుటుంబ సభ్యులు సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబపరంగానే కాకుండా రాజకీయంగా కూడా వీరిరువురి మధ్య సయోధ్య ఉండాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్ జీవించి ఉన్న కాలంలో పులివెందులలో ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకునేవారు.
కాంగ్రెసు అధ్యక్షురాలు తనకు బాధ్యతలు అప్పగించారని, వాటిని నిర్వహించడమే తన కర్తవ్యమని వైయస్ వివేకానంద రెడ్డి గురువారం స్పష్టం చేశారు. రాజకీయంగా వైయస్ జగన్ తో కలిసేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. వైయస్ జగన్ పై పరోక్షంగా వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఈ స్థితిలో వైయస్ వివేకానంద రెడ్డి రాజకీయంగా జగన్ తో కలిసి పని చేయడానికి ముందుకు రారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications