రైతు కన్నీరు రాష్ట్రానికి అరిష్టం: వైయస్ జగన్ బహిరంగ లేఖ

YS Jagan
కడప: ఆత్మహత్యలకు పాల్పడకూడదని రాష్ట్ర రైతులకు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలకు కన్నీళ్లు శాశ్వతం కాదని ఆయన లేఖలో పేర్కొన్నారు. అందరికీ త్వరలో మంచి రోజులు వస్తాయన్నారు. రైతులు గుండె దిటువు చేసుకొవాలని కోరారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. లక్ష్యదీక్షలో రైతుల బాధలు వింటుంటే గుండె తరక్కుమన్నదన్నారు. తమను ఆదుకునే దిక్కులేక అప్పుతీర్చే మార్గం లేక రైతులు తమ ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతన్నలు ధైర్యం కోల్పోవద్దని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి నిజంగానే ఇది అత్యయిక స్థితి అని చెప్పారు. రైతు కన్నీరు రాష్ట్రానికి అరిష్టం అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సాయం ప్రకటించిన తర్వాత కూడా 145 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. లక్షలాది మంది రైతులు ఒక్కచోట కూర్చుని నిరాహార దీక్ష చేసి, తమ బాధలు నినదించినా ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందన్నారు. 48 గంటల పాటు మెతుకు ముట్టకుండా నీరసించినా స్పందించలేదని ఆరోపించారు.

కాగా వైయస్ జగన్ గురువారం బెంగుళూరు వెళ్లారు. శుక్రవారం బెంగుళూరునుండి పులివెందులకు చేరుకున్నారు. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం తమ పార్టీ ప్రకటన వెలువడే ప్రదేశాన్ని ఎంపిక చేసి దానిని పరిశీలించారు. పార్టీ ప్రకటించే ప్రదేశం వైయస్ సమాధి సమీపంలోనే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+