డిసెంబర్ 31 తర్వాత ఏమీ కాదు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
రైతు మరణాలకు పంట నష్టానికి సంబంధం లేదని ఆయన అన్నారు. గుండెపోటును ఆత్మహత్యగా చిత్రీకరించవద్దని ఆయన సూచించారు. మీడియా పాజిటివ్ కథనాలు రాయాలని ఆయన హితబోధ చేశారు. ఉప్పుడు బియ్యం ఎగుమతికి అనుమతి ఇవ్వాలని కోరామని, దానివల్ల తగిన ధర లభిస్తుందని ఆయన అన్నారు. తాను పుట్టింది హైదరాబాదులోనే అయినా రాజకీయ పునాది పీలేరులోనే అని ఆయన అన్నారు. రెండు ప్రాంతాల ప్రతినిధిగా తాను గర్వపడుతున్నట్లు ఆయన తెలిపారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కన్నా తామే రైతులకు ఎక్కువ సాయం చేశామని ఆయన చెప్పారు.
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెసు తిరుపతి చిత్తూరు kiran kumar reddy chief minister congress tirupati chittoor
Story first published: Saturday, December 25, 2010, 15:41 [IST]