హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మొండికేస్తున్న తెలంగాణ ఎంపీలు: దీక్ష విరమణకు నిరాకరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్: విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తలపెట్టిన నిరాహార దీక్షను విరమించడానికి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు నిరాకరిస్తున్నారు. మంత్రి జానా రెడ్డి విజ్ఞప్తిని వారు తోసిపుచ్చారు. కేసులు ఎత్తేసే వరకు తమ దీక్ష సాగుతుందని పార్లమెంటు సభ్యుడు కె. కేశవ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుల దీక్ష హైదరాబాదులోని గన్ పార్కు నుంచి న్యూఎమ్మెల్యే క్వార్టర్ కు చేరింది. గన్ పార్కు వద్ద అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో పార్లమెంటు సభ్యులు న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ కు చేరుకుని దీక్ష సాగిస్తున్నారు.

కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు మధు యాష్కీ, అంజన్ కుమార్ యాదవ్, వి. హనుమంతరావు దీక్షలో పాల్గొనలేదు. కాగా, దీక్ష అందరూ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు పాల్గొంటారని పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ అంటున్నారు. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులకు ఎమ్మెల్సీ చుక్కా రామయ్య సంఘీభావం తెలిపారు. తెలంగాణ ప్రాంత డాక్టర్ల సంఘం ప్రతినిధులు కూడా వారిని పరామర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X