హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు తెలంగాణ ఎంపీల దీక్ష: జానా రెడ్డి దౌత్యం విఫలం

By Pratap
|
Google Oneindia TeluguNews

Jana Reddy
హైదరాబాద్: విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని నిరాహారదీక్ష చేస్తున్న కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి దౌత్యం విఫలమైంది. వారిచేత దీక్ష విరమింపజేయడానికి ఆయన సోమవారం ప్రయత్నించారు. దీక్ష విరమించి ప్రభుత్వానికి సహకారం అందించాలని ఆయన పార్లమెంటు సభ్యులను కోరారు. అందుకు వారు నిరాకరించారు. కేసులను ఎత్తేవేసే వరకు దీక్ష విరమించేది లేదని పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. తమ ప్రాణాలనైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

కేసుల ఎత్తివేయాలని తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వివరిస్తానని జానా రెడ్డి చెప్పారు. కేసులు ఎత్తేయాలని తాము సమిష్టిగా పలుసార్లు కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి, ప్రభుత్వానికి విన్నవించుకున్నామని, ఫలితం లేకపోవడం తమ పార్టీ పార్లమెంటు సభ్యులు సత్యాగ్రహం చేస్తున్నారని, వారికి తన సంఘీభావం తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. కేసు ఎత్తివేతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పార్లమెంటు సభ్యులు దీక్షలు విరమించాలని తాను కోరుతున్నానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X