వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ కుమార్ రెడ్డికి మరో తలనొప్పి: కాంగ్రెసు తెలంగాణ ఎంపీల దీక్షలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డికి మరో సమస్య తలనొప్పిగా మారింది. సొంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులే నిరవధిక నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకోవడం ఆయనకు కొరకరాని కొయ్యగా మారింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికకు ముందే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశంలో భాగంగా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు హైదరాబాదులోని గన్ పార్కు వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షకు పూనుకుంటున్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుండడంతో తాము కూడా ప్రజల పక్షాన్నే ఉన్నామని చెప్పుకోవడానికి వారు 27వ తేదీ నుంచి ఈ దీక్షకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఎంత చెప్పినా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు వెనక్కి తగ్గడం లేదు. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుల నిర్ణయం తెలిసిన వెంటనే డిఎస్ ముఖ్యమంత్రిని కలిశారు. డి. శ్రీనివాస్ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులకు ఫోన్లు చేసి మాట్లాడారు. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులతో మాట్లాడాలని కిరణ్ కుమార్ రెడ్డి పంచాయతీరాజ్ మంత్రి కె. జానా రెడ్డిని నియోగించారు. అయినా ఫలితం లేకపోయింది. వారు దీక్ష చేయడానికే సిద్ధపడ్డారు. హైదరాబాదులోని గన్ పార్కు వద్ద సోమవారం నుంచి వారు దీక్షకు దిగనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X