వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కిరణ్ కుమార్ రెడ్డికి మరో తలనొప్పి: కాంగ్రెసు తెలంగాణ ఎంపీల దీక్షలు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఎంత చెప్పినా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు వెనక్కి తగ్గడం లేదు. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుల నిర్ణయం తెలిసిన వెంటనే డిఎస్ ముఖ్యమంత్రిని కలిశారు. డి. శ్రీనివాస్ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులకు ఫోన్లు చేసి మాట్లాడారు. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులతో మాట్లాడాలని కిరణ్ కుమార్ రెడ్డి పంచాయతీరాజ్ మంత్రి కె. జానా రెడ్డిని నియోగించారు. అయినా ఫలితం లేకపోయింది. వారు దీక్ష చేయడానికే సిద్ధపడ్డారు. హైదరాబాదులోని గన్ పార్కు వద్ద సోమవారం నుంచి వారు దీక్షకు దిగనున్నారు.
Comments
Story first published: Monday, December 27, 2010, 8:36 [IST]