ఆందోళన నేరంగా చూడరాదు: కాంగ్రెసు ఎంపీల దీక్షలో కోదండరామ్

రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కేంద్రహోంశాఖ మంత్రి స్వయంగా ఆహ్వానించినా వారిలో చలనం లేదన్నారు. ఇది వలసవాదుల దుర్మార్గాన్ని బయట పెడుతుందన్నారు. ఇప్పుడు సొంత పార్టీవారే డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం దిగి రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. కాంగ్రెసు ప్రజాప్రతినిధులు తమ సాధనలో విజయం అయ్యే వరకు వారి పోరాటం కొనసాగించాలని, వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications