హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్యపై ఎసిబి కోర్టులో అమీర్ పేట భూవివాదం కేసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య భూవివాదం కేసులో ఇరుక్కున్నారు. హైదరాబాదులోని అమీర్ పేటలో 9 ఎకరాల 14 సెంట్ల భూమిని రోశయ్య తన అధికారాన్ని వినియోగించి కొంత మందికి అక్రమంగా కట్టబెట్టారనే ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కోర్టులో కేసు దాఖలైంది. మోహన్ లాల్ అనే వ్యక్తి తరఫున న్యాయవాది శ్రీరంగారావు ఈ కేసును దాఖలు చేశారు. ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని ఎసిబి కోర్టు న్యాయమూర్తి రాధారాణి అభిప్రాయపడ్డారు. వచ్చే నెల 28వ తేదీన నివేదిక సమర్పించాలని రాధారాణి ఎసిబి డైరెక్టర్ జనరల్ ను ఆదేశించింది.

అమీర్ పేటలో 200 కోట్ల రూపాయల విలువైన భూమిని 14 మందికి రోశయ్య అక్రమంగా కట్టబెట్టారని మోహన్ లాల్ ఆరోపించారు. ఈ భూలావాదేవీలో పెద్ద యెత్తున డబ్బులు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. రోశయ్య తన అనుయాయులకు ఈ భూమిని కేటాయించారని ఆయన ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X