హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉస్మానియాలో విశ్వవిద్యాలయంలో మళ్లీ టెన్షన్: పరీక్షల బహిష్కరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులు సోమవారం ఎంసిఎ,ఎంఇడి పరీక్షలను బహిష్కరించారు. పరీక్షా కేంద్రాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పరీక్షల వాయిదాకు వైస్ చాన్సలర్ తిరుపతి రావు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు పరీక్షలు బహిష్కరించి విసి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. విద్యార్థులకు ఒయు జెఎసి మద్దతు తెలుపుతోంది.

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని ఇంజనీరింగ్ కళాశాల, కోఠీ ఉమెన్స్ కళాశాల, సికింద్రాబాదులోని పిజి కళాశాలల్లో పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష రాయడానికి వెళ్లిన పది నిమిషాలకే విద్యార్థులు మూడు పరీక్షా కేంద్రాల్లోనూ బయటకు వచ్చారు. ఈ పరీక్షలను కూడా పిజి కోర్సులకు జరిగే పరీక్షలతో పాటు నిర్వహించాలని గత వారం రోజులుగా విద్యార్థులు కోరుతున్నారు. అందుకు విసి నిరాకరిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X