హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

త్వరలో గాంధీ భవన్‌కు టు లెట్ బోర్డు వస్తుంది: ఎమ్మెల్సీ రెహ్మాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gandhi Bhavan
హైదరాబాద్: హైదరాబాదులో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్‌కు టులెట్ బోర్డు రావడం ఖాయమని మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనమండలి సభ్యుడు రెహ్మాన్ ఆదివారం అన్నారు. ముందుముందు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు. 2014లో యువనేత వైఎస్ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అవడం కూడా ఖాయం అని మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ అన్నారు. జగన్‌కు మద్దతు తెలిపేందుకు ఈరోజు ఆయన నివాసానికి రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది వచ్చారు.

వైఎస్ఆర్ జిల్లా నుంచి, విశాఖ జిల్లా నుంచి, నగరంలోని పలు ప్రాంతాల నుంచి పలువురు వచ్చి జగనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ నివాసం వద్ద రెహ్మాన్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రజలు జగన్'కు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి, ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా అనేక మంది జగన్'కు మద్దతు తెలుపుతున్నారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X