గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ రాష్ట్ర రైతుల భవిష్యత్తును తాకట్టు పెట్టాడు: కోడెల శివప్రసాద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodela Sivaprasad
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల్లో తమ వాటా కోల్పోవడానికి ప్రధాన కారణం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డియేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ బుధవారం ఆరోపించారు. కడప జిల్లాలోని తన బినామీ కంపెనీలను కాపాడుకోవడానికి ఆయన రాష్ట్ర రైతుల భవిష్యత్తును బ్రజేష్ కమిటీకి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. నీటి పారుదల శాఖ నిపుణుల అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకొని ఉంటే ఈ నష్టం జరిగి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

కృష్ణా నీటిలో ఆంధ్రప్రదేశ్ వాటా కోసం రాష్ట్ర ప్రజలందరూ ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు కృష్ణా నీటిలో ఎక్కువ వాటా వెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డారు. మిగులు జలాలు పంచడం ద్వారా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఈ నష్టంతో రాష్ట్రంలోని వ్యవసాయానికి పెద్ద దెబ్బ ఉంటుందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X