సూరి హత్యతో అనంతపురం జిల్లాలో ఫాక్షనిజం ఖతం: జెసి దివాకర్ రెడ్డి
జిల్లాలో దశాబ్దకాలంగా ఉన్న ఫ్యాక్షన్ ఇక తగ్గినట్లేనని ఎవరైనా సరే రాజీ మార్గాన్ని ఎంచుకొని ప్రశాంతంగా ఉండాలన్నారు. ఫ్యాక్షన్ అంటే చర్య-ప్రతిచర్యలా ఒకరిపై ఒకరు దాడులు, హత్యలు చేసుకుంటూ పోతుంటారు. ఇద్దరిలో ఎవరు నష్టపోయినా, సర్దుకుపోయి రాజీ అవ్వాలన్నారు. జె.సి.దివాకర్రెడ్డి కూడా జగన్ పార్టీలోకి వస్తారని అనంతపురం ఎమ్మెల్యే గురుథనారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయనకు నేనేమైనా కలలో కనిపించి చెప్పానేమో. అందుకనే అలా మాట్లాడుతున్నాడు. దీనిపై మీరే అడగండి అని చెప్పుకొచ్చారు.
Comments