అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూరి హత్యతో అనంతపురం జిల్లాలో ఫాక్షనిజం ఖతం: జెసి దివాకర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
అనంతపురం: ఫ్యాక్షన్‌లో ఒక్కసారి కూరుకుపోతే బయటపడటం చాలా కష్టం. ఫ్యాక్షన్‌లో ఉంటే ఎంతటి బలవంతులైనా సరే చివరికి అంతంకాక తప్పదు. సూరి మృతితో రెండు కుటుంబాల మధ్య ఉన్న ఫ్యాక్షన్‌ కనుమరుగైనట్లేనని, జిల్లాలో ఇక ఫ్యాక్షన్‌ ఉండకపోవచ్చని మాజీమంత్రి జె.సి.దివాకర్‌రెడ్డి సూరి హత్యపై వ్యాఖ్యానించారు. తాడిపత్రిలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మొదట సూరి హత్యకు గురైన సంఘటనపై స్పందించేందుకు నిరాకరించినా తరువాత మాట్లాడారు.

జిల్లాలో దశాబ్దకాలంగా ఉన్న ఫ్యాక్షన్‌ ఇక తగ్గినట్లేనని ఎవరైనా సరే రాజీ మార్గాన్ని ఎంచుకొని ప్రశాంతంగా ఉండాలన్నారు. ఫ్యాక్షన్‌ అంటే చర్య-ప్రతిచర్యలా ఒకరిపై ఒకరు దాడులు, హత్యలు చేసుకుంటూ పోతుంటారు. ఇద్దరిలో ఎవరు నష్టపోయినా, సర్దుకుపోయి రాజీ అవ్వాలన్నారు. జె.సి.దివాకర్‌రెడ్డి కూడా జగన్‌ పార్టీలోకి వస్తారని అనంతపురం ఎమ్మెల్యే గురుథనారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయనకు నేనేమైనా కలలో కనిపించి చెప్పానేమో. అందుకనే అలా మాట్లాడుతున్నాడు. దీనిపై మీరే అడగండి అని చెప్పుకొచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X