Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భార్య కాళ్లూచేతులు నరికిన భర్త: అనుమానంతో ఘాతుకం

Krishna District
విజయవాడ: కృష్ణా జిల్లా మాచవరంలో గురువారం ఉదయం ఘాతుకం చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్య కాళ్లు, చేతులు నరికాడు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. అనుమానంతోనే అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. లక్ష్మీదుర్గకు, రాంబాబుకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. భార్యతో గొడవ పడి రాంబాబు ఆరు నెలల నుంచి వేరుగా ఉంటున్నాడు. ఆమె ఓ బడ్డీకొట్టు పెట్టుకుని పిల్లలను సాకుతూ జీవనం సాగిస్తోంది.

విపరీతంగా మద్యం సేవించే రాంబాబు నిత్యం లక్ష్మీదుర్గను వేధిస్తూ వస్తున్నాడు. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రాంబాబు లక్షీదుర్గ వద్దకు వచ్చాడు. ఆ సమయంలో ఆమె అంట్లు తోముతోంది. ఆమెతో అతను గొడవ పడ్డాడు. ఇరువురి మధ్య పెనుగులాట కూడా జరిగినట్లు సమాచారం. ఈ స్థితిలో రాంబాబు కత్తితో లక్ష్మీదుర్గ కాళ్లు, చేతులు నరికాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+