విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్య కాళ్లూచేతులు నరికిన భర్త: అనుమానంతో ఘాతుకం

By Pratap
|
Google Oneindia TeluguNews

Krishna District
విజయవాడ: కృష్ణా జిల్లా మాచవరంలో గురువారం ఉదయం ఘాతుకం చోటు చేసుకుంది. ఓ భర్త తన భార్య కాళ్లు, చేతులు నరికాడు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. అనుమానంతోనే అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. లక్ష్మీదుర్గకు, రాంబాబుకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలున్నారు. భార్యతో గొడవ పడి రాంబాబు ఆరు నెలల నుంచి వేరుగా ఉంటున్నాడు. ఆమె ఓ బడ్డీకొట్టు పెట్టుకుని పిల్లలను సాకుతూ జీవనం సాగిస్తోంది.

విపరీతంగా మద్యం సేవించే రాంబాబు నిత్యం లక్ష్మీదుర్గను వేధిస్తూ వస్తున్నాడు. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రాంబాబు లక్షీదుర్గ వద్దకు వచ్చాడు. ఆ సమయంలో ఆమె అంట్లు తోముతోంది. ఆమెతో అతను గొడవ పడ్డాడు. ఇరువురి మధ్య పెనుగులాట కూడా జరిగినట్లు సమాచారం. ఈ స్థితిలో రాంబాబు కత్తితో లక్ష్మీదుర్గ కాళ్లు, చేతులు నరికాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X