నాపై, వైయస్ జగన్‌పై ఓ దుష్టశక్తి కుట్ర చేస్తోంది: గాలి జనార్దన్ రెడ్డి

Gali Janardhan Reddy
బళ్లారి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) అధినేత, కర్ణాటక మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. తమపై లేనిపోని ఆరోపణలతో కావాలనే తమ మైనింగ్ లీజులను రద్దు చేయాలని కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) సుప్రీంకోర్టుకు సిఫారసు చేసిందని మండిపడ్డారు. శుక్రవారం హడావుడిగా తన కుటీరంలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న కలలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ‌ను, కర్ణాటకలో తనను నాశనం చేయాలని ఓ దుష్టశక్తి చూస్తోందని, తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. తమను 'అంతం' చేయాలని చూస్తోందని, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను అతలాకుతలం చేయాలని కంకణం కట్టుకుందని ఆరోపించారు. ఆ దుష్టశక్తి ఎవరనే విషయాన్ని దేశ ప్రజలకు వెల్లడిస్తానన్నారు.

మైనింగ్ లీజు రద్దుకు సిఫార్సు చేసే అర్హత సీఈసీకి లేదన్నారు. దేవుడు తమవైపు ఉన్నాడని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. తమ దగ్గర కొన్ని విష్ణు చక్రాల్లాంటివి ఉన్నాయని, తాము కూడా వాటిని బహిర్గతం చేస్తామని కేంద్రాన్ని ఉద్దేశించి ఆయన హెచ్చరించారు. అటవీ ప్రాంతాల్లో మైనింగ్ జరుగుతోందా లేదా అన్న విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సీఈసీని నియమించిందని, దానిని వదిలేసి మిగిలిన విషయాల్లో సీఈసీ జోక్యం చేసుకుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుబడుతూ తమ మైనింగ్ లీజులను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకు నివేదిక అందజేసిందని మండి పడ్డారు. అయినా, ఈ నివేదిక కొత్తదేమీ కాదని కొట్టిపారేశారు. సీఈసీకి నేతృత్వం వహిస్తున్న ఏకే జ్వరాజీ రాజకీయ శక్తులకు తలొగ్గారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+