తెలంగాణపై రెండు నెలల్లో నిర్ణయం, చిరు స్థితే జగన్‌ది: జైపాల్ రెడ్డి

S Jaipal Reddy
హైదరాబాద్: తెలంగాణపై తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం రెండు నెలల్లోగా నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి చెప్పారు. మీడియా ప్రతినిధులతో ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలంగాణపై సీమాంధ్ర నాయకుల్లో కూడా పరివర్తన వస్తోందని ఆయన చెప్పారు. 1969లో తెలంగాణ కోసం జరిగింది మిడిల్ క్లాస్ ఉద్యమమని, ఇప్పుడు జరుగుతోంది మాస్ ఉద్యమమని ఆయన అన్నారు. తెలంగాణపై ఏదో నిర్ణయం తీసుకోక తప్పదని ఆయన అన్నారు.

మర్రి చెన్నారెడ్డి మాదిరిగా తాను అపవాదులు తెచ్చుకోదలుచుకోలేదని, అందుకే ముఖ్యమంత్రి పదవిని తీసుకోలేదని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమర్థుడైన నాయకుడని, అందుకే పార్టీని నిలబెట్టుకోగలుగుతున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిపోవడం వల్ల గందరగోళ పరిస్థితి నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీ ఓట్లనే చీలుస్తారని, అయితే అధికారంలోకి రాలేడని ఆయన అన్నారు. వైయస్ జగన్‌ది ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పరిస్థితేనని ఆయన అన్నారు.

సీమాంధ్రులను సంతృప్తిపరచడానికే అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేశారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+