హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వెంట ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్యేలపై అధిష్టానం సీరియస్: డిఎస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srinivas
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డితో పాటు దీక్షలో పాల్గొనేందుకు న్యూఢిల్లీ వెళ్లిన శాసనసభ్యుల తీరును పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు. వారి వైఖరిపై అధిష్టానం కూడా సీరియస్‌గా ఉన్నట్టు చెప్పారు. వారి తీరుపై పార్టీ పరంగా చర్యలు ఉంటాయని చెప్పారు. జగన్‌తో వెళ్లడం ఖచ్చితంగా పార్టీ వ్యతిరేక చర్యే అన్నారు. నేను తెలంగాణకు అనుకూలమని ఆయన చెప్పారు. నేను పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడే తెలంగాణకు అనుకూలమని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

నేను తెలంగాణవాదినేనని అయితే తనకు ఎవరూ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. నా చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. అయితే పిసిసి అధ్యక్షుడిగా అన్ని ప్రాంతాలవారిని సమానంగా చూడాల్సిన బాధ్యత, నడిపించాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. తెలంగాణకు చెందిన కాంగ్రెసు నాయకులు అధిష్టానాన్ని ఒప్పించే విధంగా ప్రవర్తించాలన్నారు. కాంగ్రెసు పార్టీలో ఉన్నాం కాబట్టి అధిష్టానాన్ని ఒప్పించి తీసుకోవాలి అని చెప్పారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేదని డిఎస్ అన్నారు. కమిటీ నివేదిక ఎవరికి అనుకూలమో, ఎవరికి వ్యతిరేకమో ఊహించుకోవడం సరికాదన్నారు. కాంగ్రెసు పార్టీనుండి ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీకి విరుద్దంగా ప్రవర్తించడం సబబుకాదన్నారు. నేతల వ్యవహార శైలిపై ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదిక పంపుతున్నామన్నారు. నివేదికపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమని, తెలంగాణ అంశంపై నిర్ణయం పార్టీ అధిష్టానం చెబుతుందన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అదనపు బలగాలు అవసరం లేదని డిఎస్ అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X