తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హైదరాబాదే చిక్కుముడి: జైపాల్ రెడ్డి
తెలంగాణపై కాంగ్రెసు క్షీరసాగర మథనం చేస్తోందని, అందులో ఆలస్యమైనా అమృతం వస్తుందని ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వ్యాఖ్యానించారు. తెలంగాణపై ప్రతిష్టంభన నెలకొన్న మాట నిజమేనని ఆయన అంగీకరించారు. పునాదుల్లోకి తెలంగాణవాదం చొచ్చుకుపోయిందని ఆయన అన్నారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఎక్కువ మంది, తెలంగాణ పార్లమెంటు సభ్యులు తక్కువ మంది ఉన్నారని, ఇది కూడా సమస్యకు ఓ ప్రధాన కారణమని ఆయన అన్నారు. సంక్రాంతి పర్వదినం తర్వాత తమకు సోనియా ఆపాయింట్మెంట్ ఇప్పించాలని రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని కోరారు.
Comments
Story first published: Monday, January 10, 2011, 14:41 [IST]