హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజీనామాలపై వెనక్కి తగ్గిన ఎంపీలు: సమావేశం రద్దు కోరుతున్న ఎంపీలు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ తమ నివేదికను తెలంగాణకు అనుకూలంగా ఇవ్వకుంటే రాజీనామాలకు సిద్ధమని ప్రకటించిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ప్రస్తుతం వెనక్కు తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక వ్యతిరేకంగా ఉండటంతో ఈనెల 11వ తారీఖున భవిష్యత్తు కార్యాచరణ కోసం తెలంగాణ కాంగ్రెసు ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశం కానున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ సమావేశాన్ని రద్దు చేయాలని ఎంపీలు కోరుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

సమావేశం ఏర్పాటు చేస్తే రాజీనామాలకు కొందరు నేతలు డిమాండ్ చేసే అవకాశం ఉన్నందున సమావేశాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అని ఇన్నాళ్లు పలికిన నేతలకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. తెలంగాణ రాకుంటే రాజీనామా అని ఇన్నాళ్లు ప్రకటించిన వాళ్లు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా ఉంటున్నారు. గత నెల రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ రాకుంటే తన ఏఐసిసి పదవిని ఇలా వదిలేస్తానని ప్రకటించిన కె కేశవరావు ఇటీవల రాజీనామాలు చేస్తే తెలంగాణ వస్తుందని అని ప్రశ్నించడం గమనించదగ్గ విషయం.

ఇన్నాళ్లూ రాజీనామాలు అంటూ మాట్లాడిన నేతలు ఇప్పుడు రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. సమావేశం ఏర్పాటు చేస్తే రాజీనామాకు ఎవరైనా డిమాండ్ చేయవచ్చనే ఉద్దేశ్యంతోనే ఎంపీలు వెనక్కు తగ్గుతున్నట్లు తెలస్తోంది. రేపటి సమావేశం యథావిధిగా జరుగుతుందని, సమావేశం రద్దు కాదని కాంగ్రెసు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి స్పష్టం చేశారు. కాగా కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఇంట్లో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, డికె అరుణలు భేటీ అయ్యారు. తెలంగాణ, శ్రీకృష్ణ నివేదిక తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X