వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెరిటేజ్ ముందు తెలంగాణ బోర్డులు బాబు ఆస్తుల రక్షణకే: కెటిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

KT Rama Rao
నల్గొండ: తన ఆస్తులు కాపాడుకోవటానికే తాము తెలంగాణకు అనుకూలమంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన హెరిటేజ్ సంస్థల ముందు బోర్డులు పెట్టారని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారకరామారావు సోమవారం ఆరోపించారు. ఆస్తులు కాపాడుకోవడానికి హెరిటేజ్ ముందు బోర్డులు పెట్టిన చంద్రబాబు తన ఇంటిముందు కూడా తెలంగాణకు అనుకూలమని బోర్డు పెట్టాలని కోరారు. తెలంగాణకు తాము అనుకూలమని కేంద్రమంత్రి ప్రణబ్‌ముఖర్జీకి, శ్రీకృష్ణ కమిటీకి చంద్రబాబు లేఖ రాయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు బిచ్చమెత్తుకుంటున్నట్టు చంద్రబాబును అర్థిస్తున్నారని విమర్శించారు. వారిని చూస్తుంటే జాలిగా ఉందన్నారు. వారు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీని వీడి బయటకు రావాలన్నారు. అప్పుడే తెలంగాణ కోసం ఉద్యమం అంటే ప్రజలు నమ్ముతారన్నారు. నాగం జనార్ధన్‌ రెడ్డి, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకరరావు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రత్యేక శాఖ అంటూ డ్రామాలు చేస్తున్నారన్నారు. వారి డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉంటామన్న జానారెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు చరిత్రహీనులుగా మిగిలి పోతారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X