వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్రుల చెరలో తెలంగాణ ఎమ్మెల్యేలు: జెఏసి చైర్మన్ కోదండరామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
మహబూబ్‌ నగర్: తెలంగాణకు చెందిన శాసనసభ్యులందరూ సీమాంధ్ర నేతల చెరలో ఉండిపోయారని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సోమవారం మహాధర్నాలో అన్నారు. మహబూబ్‌నగర్లో జరిగిన కలెక్టరెట్ ముట్టడి మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన నాయకులు ఆంధ్రా నాయకులతో ములాఖత్‌కు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. మన నాయకుల మధ్య అనైక్యత ఉందన్నారు. వారి అనైక్యత వల్లే కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వారి నిర్లక్ష్యమే విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

సంక్రాంతి పండుగ తెలంగాణకు కీడు పండుగ అని అన్నారు. అదే సంక్రాంతి పండుగ ఆంధ్రా వారికి మంచి పండుగ అని చెప్పారు. సంక్రాంతి వరకు తెలంగాణకు కీడు దినాలు కాబట్టి ఉద్యమాన్ని అప్పటి వరకు తీవ్రతరం చేయమని చెప్పారు. పండుగ తర్వాత కీడు దినాలు వెళ్లిపోతాయని ఆ తర్వాత 16వ తేదినుండి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం ధర్నాలు, రాస్తారోకోలు పెద్ద ఎత్తున చేస్తామన్నారు. కాగా కలెక్టరేట్ ముట్టడి ధర్నాలో కోదండరామ్ పాల్గొన్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X