గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మధ్యంతరం తప్పదు: వైయస్ జగన్ హవాపై వెంకయ్య నాయుడు వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Venkaiah Naidu
గుంటూరు: పార్లమెంటుకు, శాసనసభకు మధ్యంతర ఎన్నికలు తప్పవని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత ఎం. వెకయ్యనాయుడు జోస్యం చెప్పారు. నెల్లూరు జిల్లాకు బయలుదేరుతూ ఆయన గుంటూరు జిల్లా సూళ్లూరుపేటలో ఆయన సోమవారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్ జగన్ దీక్షల వల్ల, కాంగ్రెసు అవినీతి వల్ల మార్చిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయని, రాష్ట్ర రాజకీయ పరిణామాల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతాయని ఆయన అన్నారు. వైయస్ జగన్ హవాతో కాంగ్రెసు పునాదులు కదులుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మంత్రులపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు పట్టు లేకుండా పోయిందని, దీంతో అవినీతి విచ్చలవిడిగా సాగుతోందని ఆయన అన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ దండగ కమిటీ అని, ఏ ప్రాంతాలవారు ఏది కావాలంటే దాన్ని నివేదికలో పొందుపరిచిందని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X