విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒకరిద్దరు వెళితే లెక్క చేయను: జగన్ ‌తో వెళ్లిన నల్లపురెడ్డిపై చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
విజయవాడ: పార్టీలో చెత్త సరుకు ఉంటే అమ్ముడు పోతారని మొదటినుండి పార్టీకోసం పనిచేసే అసలైన కార్యకర్తలు పార్టీని వీడరని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం విజయవాడలో ద్వజమెత్తారు. పార్టీనుండి ఒకరిద్దరు వెళ్లినా నేను లెక్కపెట్టనని, పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. డబ్బులకోసం అమ్ముడుపోయే వారిని లెక్కపెట్టవలసిన అవసరం లేదన్నారు. పార్టీకి అసలైన కార్యకర్తలు, నాయకులు ఉన్నారన్నారు. మా పార్టీ రాష్ట్రంలో చాలా పటిష్టంగా ఉందన్నారు.

అవీనితీతో సంపాదించిన డబ్బుతో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి కొంటున్నారని ఆరోపించారు. కానీ తెలుగుదేశం పార్టీలో డబ్బులు ఖర్చు పెట్టి సేవ చేసే చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తలు ఉన్నారన్నారు. కొవూరు శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మరో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిలు జగన్‌కు మద్దతు పలకడం తెలిసిందే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై నిర్ణయం తీసుకోవాల్సింది మేం కాదని అది కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X