హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విభజనను పెంచి పోషిస్తున్నారు: సిఎం కిరణ్‌ కు దత్తాత్రేయ లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bandaru Dattatreya
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి మరో లేఖ రాశారు. ఇప్పటికే ముఖ్యమంత్రికి ఆయన నాలుగు లేఖలు రాశారు. ఇది ఐదవది. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలం అయిందని అందులో దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం అంశాన్ని కాంగ్రెసు పార్టీయే రాద్దాంతం చేస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను కాంగ్రెసు పెంచి పోషిస్తుందన్నారు.

రాష్ట్ర కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు, నేతలు అందరూ అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప పాలనా పరమైన విషయాలు ఆలోచించడం లేదన్నారు. వారికి ప్రజా సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. కాగా బండారు దత్తాత్రేయ కాంగ్రెసు ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తూ తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వందకు పైగా లేఖలు రాశారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు సైతం లేఖాస్త్రాలు సంధించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X