పిసిసి చీఫ్‌గా డిఎస్ కొనసాగింపు, ఎఐసిసి అధికారిక ప్రకటన

D Srinivas
న్యూఢిల్లీ‌: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్‌ను కొనసాగించాలని అధిష్టానం నిర్ణయించింది. మూడవసారి పీసీసీ అధ్యక్షుడిగా డి.శ్రీనివాస్‌ను నియమిస్తూ ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటికి రెండుసార్లు ఆయన ఈ పదవిలో ఉన్నందున ఈసారి ఆయనను మార్చటం ఖాయమని ప్రచారం జరిగింది. కేవీపీ, సురేష్‌రెడ్డి తదితరుల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే పార్టీలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితి దృష్ట్యా అనుభవం ఉన్న డీఎస్‌నే కొనసాగించటం మేలని అధిష్టానం అభిప్రాయపడింది. తెలంగాణకు చెందినవాడు కావటం కూడా డీఎస్‌కు కలిసి వచ్చింది.

ముఖ్యమంత్రి సీమాంధ్రకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి కావడం వల్ల తెలంగాణ నాయకుడిని పిసిసి పదవిలో నియమించడం అవసరంగా మారింది. దీంతో తెలంగాణ నుంచి డిఎస్‌ను మించిన నాయకుడు ఎఐసిసికి కనిపించలేదని భావించాల్సి ఉంటుంది. సీమాంధ్ర నాయకులకు కూడా డిఎస్ ఆమోదయోగ్యం కావడం అందుకు ప్రధాన కారణం. దానికితోడు, పార్టీని సమన్వయం చేయడంలో డిఎస్‌ పాత్ర గణనీయమైందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+