వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ జిల్లాల్లో జెఏసి రాస్తారోకో, కి.మీ. మేర నిలిచిపోయిన వాహనాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు తెలంగాణలోని పది జిల్లాల్లో వేలాదిమంది తెలంగాణవాదులు రాస్తారోకో నిర్వహించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర తెలంగాణ జిల్లాల్లో జెఏసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాస్తారోకోకు భారీగా స్పందన లభిస్తోంది. తెలంగాణవాదులు స్వచ్చందంగా తరలివచ్చి రహదారుల దిగ్బంధంలో పాల్గొంటున్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలో జనగా, సూర్యాపేట, సిద్దిపేట రహదారిలో రాస్తారోకో నిర్వహించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఖమ్మం, కరీంగర్ జిల్లాస్సో సింగరేణి కార్మికుల రాస్తారోకో కారణంగా బొగ్గు గనులలోకి వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇల్లెందు-పాల్వంచ-భద్రాచలం-కొత్తగూడెం ప్రధాన రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. రహదారుల దిగ్బంధంవల్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జై తెలంగాణ అంటూ నినదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు పదవుల కోసం కాకుండా తెలంగాణ కోసం రాజీనామాలు చేయాలని కోరారు. కాంగ్రెసు, టిడిపి పార్టీలనుండి ఆయా ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి తెలంగాణ కోసం పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలు వారని ఉపేక్షించరని హెచ్చరించాలు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X