తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి గల్లా అరుణకుమారితో వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేల భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Galla Aruna Kumari
తిరుపతి: రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి నివాసంలో శనివా రం వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంత్రిని కలిసిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ వర్గానికి చెందిన వారు కావడంతో ఈ విషయానికి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. వైఎస్ఆర్ జిల్లాకు చెందిన రాజంపేట, రాయచోటి, కోడూరు ఎమ్మెల్యే లు అమరనాథరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్ శనివారం సాయంత్రం కరకంబాడిలోని అరుణ నివాసంలో భేటీ అయ్యారు.

కాణిపాకం వినాయకస్వామి దర్శనానంతరం వీరు ముగ్గురూ మంత్రి నివాసానికి చేరుకుని సుమారు గంట సేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. అరుణ గత నాలుగేళ్లుగా వైఎస్ఆర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నారు. ఆ సంబంధాల నేపథ్యంలో అభివృద్ధి పనుల దృష్ట్యా మంత్రిని కలిశారా, లేక రాజకీయ నేపథ్యంలో కలిశారా అనే విషయంపై కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అయితే, జగన్ వర్గంగా ముద్రపడిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకేసారి అధిష్ఠానాన్ని బలపరుస్తున్న మంత్రిని కలవడాన్ని యాదృచ్ఛికం అనుకోవడానికి ఆస్కారం లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. సీఎం సూచన మేరకు అరుణ..ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను తన ఇంటికి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగమ ని కోరారా...!? అనేది పార్టీ వర్గాలకూ అంతుబట్టడం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X