మంత్రి గల్లా అరుణకుమారితో వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేల భేటీ
కాణిపాకం వినాయకస్వామి దర్శనానంతరం వీరు ముగ్గురూ మంత్రి నివాసానికి చేరుకుని సుమారు గంట సేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. అరుణ గత నాలుగేళ్లుగా వైఎస్ఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్నారు. ఆ సంబంధాల నేపథ్యంలో అభివృద్ధి పనుల దృష్ట్యా మంత్రిని కలిశారా, లేక రాజకీయ నేపథ్యంలో కలిశారా అనే విషయంపై కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అయితే, జగన్ వర్గంగా ముద్రపడిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకేసారి అధిష్ఠానాన్ని బలపరుస్తున్న మంత్రిని కలవడాన్ని యాదృచ్ఛికం అనుకోవడానికి ఆస్కారం లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. సీఎం సూచన మేరకు అరుణ..ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను తన ఇంటికి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగమ ని కోరారా...!? అనేది పార్టీ వర్గాలకూ అంతుబట్టడం లేదు.
Comments
Story first published: Monday, January 17, 2011, 8:29 [IST]