అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణ నివేదికపై కాకుండా తెలంగాణపై చర్చిస్తే ఓకే: కిషన్‌ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
అనంతపురం: తెలంగాణ అంశంపై కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించడానికి కేంద్రం తమను పిలిస్తే వెళ్లేది లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్‌పేట నియోజకవర్గ శాసనసభ్యుడు గంగారపు కిషన్‌రెడ్డి మంగళవారం అన్నారు. శ్రీకృష్ణ నివేదికపై కాకుండా తెలంగాణ అంశంపై మాట్లాడుతామని ఆహ్వానం వస్తే మాత్రం వెళతామని స్పష్టం చేశారు. శ్రీకృష్ణ కమిటీ ఓ టైంపాస్ కమిటీ అన్నారు. అలాంటి కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించడానికి వెళ్లవలసిన అవసరం లేదన్నారు.

ఇక్కడి పార్లమెంటు సభ్యుల తీరు తీవ్ర అవమానకరంగా ఉందని ఆన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీలు తమ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో అధిష్టానం పేరుతో అక్కడి పెద్దలకు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. తాము గత సంవత్సరం కేంద్రం పిలిచినా వెళ్లలేదని, ఇటీవల శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇస్తామని చెప్పినా వెళ్లలేదని చెప్పారు. ఇప్పుడు కూడా నివేదిక గురించి వెళ్లే ప్రసక్తి లేదన్నారు. నివేదికతో సంబంధం లేకుండా ఖచ్చితంగా తెలంగాణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ సామాన్యుడి జీవనాన్ని కష్టంగా మార్చుతుందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X