శ్రీకృష్ణ నివేదికపై కాకుండా తెలంగాణపై చర్చిస్తే ఓకే: కిషన్ రెడ్డి
ఇక్కడి పార్లమెంటు సభ్యుల తీరు తీవ్ర అవమానకరంగా ఉందని ఆన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీలు తమ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో అధిష్టానం పేరుతో అక్కడి పెద్దలకు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. తాము గత సంవత్సరం కేంద్రం పిలిచినా వెళ్లలేదని, ఇటీవల శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇస్తామని చెప్పినా వెళ్లలేదని చెప్పారు. ఇప్పుడు కూడా నివేదిక గురించి వెళ్లే ప్రసక్తి లేదన్నారు. నివేదికతో సంబంధం లేకుండా ఖచ్చితంగా తెలంగాణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ సామాన్యుడి జీవనాన్ని కష్టంగా మార్చుతుందన్నారు.
Comments
కిషన్ రెడ్డి బిజెపి శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ అనంతపురం kishan reddy bjp srikrishna committee telangana anantapur
Story first published: Tuesday, January 18, 2011, 12:09 [IST]